రాష్ట్రంలో కొత్తగా 2,214 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,214 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,214 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,93,600 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1135కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,474 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,63,407గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,058 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,702 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 54,443 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 30,50,444 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 84.40 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 305, రంగారెడ్డి 191, మేడ్చల్ 153, నల్గొండ 149, కరీంనగర్ 106, వరంగల్ అర్బన్ 131, భద్రాద్రి 99, ఖమ్మం 99, సిద్ధిపేట్ 80, సూర్యపేట్ 68, సిరిసిల్ల 67, కామారెడ్డి 66, నిజామాబాద్ 65, మహబూబా బాద్ 59, సంగారెడ్డి 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్​మాల్​.. రూ. 14 లక్షలు కొట్టేసిన మహిళ ఆపరేటర్

అధికారుల తప్పిదంతో మూడేళ్లుగా అందని రైతుబంధు

రైతు.. ఇప్పుడిక బిజినెస్ మ్యాన్