పరిస్థితులు చక్కబడిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు

పరిస్థితులు చక్కబడిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు

దేశంలో కరోనా  పరిస్థితులు చక్కబడిన తర్వాతే పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని ఎంపీలకు  ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. మిషన్ కనెక్ట్ లో భాగంగా రాజ్యసభ సభ్యులతో ఇవాళ(బుధవారం) ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పరిశీలించిన  తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు.