సీఎం క్యాంప్ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత : జీతాలు పెంచాలని NUHM ఉద్యోగుల నిరసన

సీఎం క్యాంప్ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత : జీతాలు పెంచాలని NUHM ఉద్యోగుల నిరసన

హైదరాబాద్ : డిమాండ్ల సాధన కోసం సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు నేషనల్ హెల్త్ మిషన్ ప్రభుత్వ ఉద్యోగులు. తమకు న్యాయం చేయాలంటూ క్యాంపు ఆపీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా….కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు ఉద్యోగులు. జాబ్ లో చేరినప్పటి నుంచి 10 వేల జీతం మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. వెంటనే జీతాలను 25 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.