దర్భంగా బ్లాస్ట్ కేసులో కీలక సాక్ష్యం

దర్భంగా బ్లాస్ట్ కేసులో కీలక సాక్ష్యం

దర్భంగా బ్లాస్ట్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక సాక్ష్యాలు సేకరిస్తోంది. పార్సిల్ పంపేందుకు నిందితులు పాన్ కార్డ్ వాడినట్లుగా గుర్తించారు. ఇక్బాల్ ఖానా అనే తీవ్రవాది పాకిస్తాన్ నుంచి దర్బంగా బ్లాస్ట్ ఆపరేట్ చెశాడు. మహ్మద్ సూఫియాన్ పేరుతో నకిలీ పాన్ కార్డ్ సృష్టించి మాలిక్ బ్రదర్స్‌కు అందజేశాడు. దర్భంగా బ్లాస్ట్ మాస్టర్ మైండ్ హాజీ సలీంతో ఇక్బాల్ ఖానా వ్యవహారం నడిపినట్లు NIA అధికారులు గుర్తించారు. ఇండియన్ ఏజెన్సీలకు ఇక్బాల్ ఖానా ఎప్పటినుంచో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు.