
పహల్గాం ఉగ్రదాడి తర్వాత నిఘా సంస్థ ఎన్ఐఏ స్పీడు పెంచింది. దేశ వ్యాప్తంగా పాక్ నిఘా సంస్థ ISIతో సంబంధాలపై ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఇవాళ (జూన్ 1) దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 15 చోట్ల ఏకకా లంలో NIA తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
పాక్ నిఘా సంస్థ ఐఎ స్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన ఇండ్లు, ఆఫీస్ లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఈ దాడుల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు. కొన్ని సున్నితమైన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు ఎన్ఐఏకు దొరికాయి.
పా కిస్థాన్ నుంచి గూఢచర్యం రాకెట్ ను నడిపిస్తున్న ఆపరేటివ్స్ సమాచారాన్ని తెలుసుకోవడానికి వీటిని విశ్లేషిస్తామని అధికారులు చెప్పారు. గూఢచర్యానికి అవసరమైన ఆర్థిక సహకారాలు వీరి నుంచి అందినట్లు తాము అనుమానిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే పాక్ అధికారులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సహా పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాసిం అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. సున్నితమైన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసినట్లు తెలుస్తోంది.