
హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమ్స్ హాస్పిటల్లో ఓ కార్మికుడు సీపీఆర్ చేసి రోగి ప్రాణాలు కాపాడాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని పెద్ద నక్కలపేటకు చెందిన బగ్గీ అశోక్ బుధవారం నిమ్స్లోని జనరల్ మెడిసిన్ విభాగంలో టెస్టుల కోసం వచ్చాడు. ఉన్నట్టుండి నిలబడ్డ చోటే కుప్పకూలాడు.
అక్కడే ఉన్న కార్మికుడు శ్రీనివాస్ డాక్టర్ల కోసం ఎదురు చూడకుండా సీపీఆర్ చేశాడు. అనంతరం ట్రాలీలో ఏఎంసీ వార్డుకు తీసుకువెళ్లి అడ్మిట్చేయడంతో ప్రాణాలు నిలిచాయి. దీంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన శ్రీనివాస్ను నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప సోమవారం అభినందించారు. అశోక్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.