మాల్దీవ్ అగ్ని ప్రమాదంలో 9 మంది భారతీయుల మృతి

మాల్దీవ్ అగ్ని ప్రమాదంలో 9 మంది భారతీయుల మృతి

మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేశ రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 10 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వాటిని అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది.

మాలేలోని ఓ బిల్డింగ్ లో 10 మంది విదేశీ కార్మికులు నివాసం ఉంటున్నారు. ఉదయం ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్యారేజీలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే పై అంతస్థులకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం పై అంతస్థులో ఉన్న 10 మంది బయటకు రాలేకపోయారు. పొగ, మంట కారణంగా ప్రాణాలు వదిలారు. మృతుల్లో 9 మంది భారతీయులు ఉండగా.. ఒకరు బంగ్లాదేశీ ఉన్నారు. మంటల్ని అదుపు చేసేందుకు 4 గంటల సమయం పట్టినట్లు ఫైర్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాద ఘటన మాల్దీవుల్లో విదేశీ కార్మికుల దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఆ దేశ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

మాలేలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ఇండియన్ హై కమిషన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి మాల్దీవ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది.