ప్రసవం కోసం హాస్పిటల్కు వెళ్లేందుకు ఓ నిండు గర్భిణి నరకయాతన పడింది. ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా పది కిలోమీటర్లు నడిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన సంధ్యారాణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు
108 అంబులెన్స్కు ఫోన్చేశారు. రోళ్ల గడ్డ నుంచి గుండాలకు వెళ్లాలంటే మధ్యలో మల్లన్న వాగు దాటాలి. రెండు రోజులుగా వానలతో మల్లన్న వాగు పొంగుతోంది. అంబులెన్స్ వాగు అవతలే ఉండిపోవడంతో రోళ్లగడ్డ నుంచి మల్లన్నవాగు వరకు దాదాపు 10 కి.మీ. నడిచింది సంధ్యారాణి. ఇంత సాహసం చేసిన సంధ్యారాణి ఖమ్మం ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.