సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి పట్టణంలోని మెహబూబ్ సాగర్ చెరువులో బుధవారం టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మలా జగ్గారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తో కలిసి చేప పిల్లలను వదిలారు. వారు మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో భవిష్యత్లో మత్స్యకారుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు ,మత్స్య సహకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
