మెదక్‌‌‌‌లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

మెదక్‌‌‌‌లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో బుధవారం రాత్రి హనుమాన్​ జయంతి సందర్భంగా శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్–- హైదరాబాద్​ వెల్​కమ్​బోర్డులోని అభయ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో హనుమాన్​, శ్రీరాముడు, భజరంగ్​భళీ విగ్రహాలను ట్రాక్టర్లలో ఉంచి ర్యాలీగా బయల్దేరారు.

వెల్​కమ్​ బోర్డు నుంచి శోభాయాత్ర ప్రారంభం కాగా ఆటోనగర్, పాత బస్టాండ్, రాందాస్​ చౌరస్తా, జేఎన్​ రోడ్డు, ముత్యాలమ్మ ఆలయం, చమన్​ హనుమాన్​ ఆలయం, బాలాజీ మఠం, పోస్టాఫీసు, బోరంచమ్మ దేవాలయం మీదుగా కోదండ రామాలయం వరకు నిర్వహించగా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. డీఎస్పీ ప్రసన్నకుమార్​ నేతృత్వంలో మెదక్​ టౌన్​, రూరల్​, సీఐలు మహేశ్‌‌‌‌, జార్జ్, ఎస్సైలు భద్రతా ఏర్పాట్లను
 పర్యవేక్షించారు.  

01mdk54  - మెదక్​లో హనుమాన్​ శోభాయాత్ర 
01mdk55హనుమాన్​ శోభాయాత్రలో యువత