
బషీర్ బాగ్, వెలుగు: హాస్టల్మొత్తం తమకే కేటాయించాలని కోరుతూ నిజాం కాలేజీ యూజీ స్టూడెంట్లు చేపట్టిన ఆందోళనలు ఐదో రోజైన బుధవారం కొనసాగాయి. అయితే కాలేజీ హాస్టల్ను 50 శాతం యూజీ స్టూడెంట్లకు, 50 శాతం పీజీ స్టూడెంట్లకు కేటాయిస్తూ ప్రిన్సిపాల్బుధవారం సర్క్యులర్జారీ చేశారు. దీంతో యూజీ స్టూడెంట్లు రోజంతా క్యాంపస్లోనే బైఠాయించి నిరసన తెలిపారు. చీకటి పడినా అక్కడి నుంచి కదల్లేదు.
మొబైల్ టార్చ్లైట్ల వెలుగులో ఆందోళనను కొనసాగించారు. తమ డిమాండును పట్టించుకోకుండా ప్రిన్సిపాల్పీజీ స్టూడెంట్లకు హాస్టల్కేటాయించడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ స్టూడెంట్ల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేకంగా హాస్టల్ ఉందని గుర్తుచేశారు. కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి స్టూడెంట్లను పంపించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. చీకట్లోనే నిరసన తెలిపారు.