
మోర్తాడ్, వెలుగు: నిజామాబాద్జిల్లా శ్రీరామ్సాగర్ప్రాజెక్టు(ఎస్ఆర్ఎస్పీ) కాకతీయ కెనాల్లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మెండోరా ఎస్సై శ్రీనివాస్తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్లోని గాయత్రీనగర్కు చెందిన చింటు, వేణుయాదవ్(23), ప్రణవ్(24) శుక్రవారం మెండోరా గ్రామానికి చెందిన తమ ఫ్రెండ్పవిత్ర్ రెడ్డి వద్దకు వచ్చారు. నలుగురూ కలిసి మెండోరా సమీపంలోని కాకతీయ కెనాల్లో స్నానం చేసేందుకు వెళ్లారు. ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. చింటు, పవిత్ర్ రెడ్డి బయటపడ్డారు. గల్లంతైన యువకుల గాలింపు కోసం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాల్వకు నీటి విడుదలను ఆపేశారు.