నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా యూత్కోసం గురువారం నిజామాబాద్నగరంలోని శ్రీరామాగార్డెన్లో నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టాస్క్ సౌజన్యంతో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా ఏర్పాటు చేయగా కలెక్టర్ఇలా త్రిపాఠి, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు. సుమారు 4 వేల మంది యువత మేళాకు తరలిరాగా వారిలో అర్హతలను బట్టి 71 కంపెనీలు 2 వేల మందికి జాబ్స్ఇచ్చాయి.
టెన్త్మొదలుకొని అపై విద్యార్హతలు ఉన్న వారి కోసం విడివిడిగా కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ చేసుకున్నారు. జాబ్స్పొందిన యూత్కు కలెక్టర్, ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్తాహెర్, అడిషనల్ కలెక్టర్దిలీప్కుమార్, మార్కెట్కమిటీ చైర్మన్ముప్ప గంగారెడ్డి, డీవైఎస్వో పవన్కుమార్, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
