ఆ కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరగలె : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆ కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరగలె : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి మీడియాలో తప్పుగా ప్రచారమైన కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరగలేదని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలన్న దానిపైనే చర్చించినట్లు చెప్పారు. పార్టీ హైకమాండ్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి టికెట్లు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్టు వెంకట్ రెడ్డి చెప్పారు. గతంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల గోల్కొండ హోటల్ లో గొడవలు జరిగిన విషయాన్ని గుర్తు చేశానని అన్నారు. తెలుగు దేశంతో పొత్తు వద్దని చెప్పానని ఆయన స్పష్టం చేశారు. 

మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలను మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని వెంకట్ రెడ్డి అన్నారు. ఓ సర్వే రిపోర్ట్ ఆధారంగానే తాను మాట్లాడినట్టు చెప్పారు. తన పాదయాత్ర ఈ నెలాఖరులో ఉంటుందన్న ఆయన.. భువనగిరి నుంచి దాన్ని మొదలుపెడతానని అన్నారు. ఉత్తమ్ కుమార్ నల్గొండలో మొదలుపెట్టి, ఖమ్మంలోనూ యాత్ర కొనసాగిస్తారని చెప్పారు. గ్రామాల్లో బైక్ యాత్రల ద్వారా రెడ్డి.. సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.