
లండన్: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇండియా సీనియర్ టీమ్ శనివారం లండన్కు చేరుకుంది. 2025–27 వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా ఈ సిరీస్లో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్–ఎ జట్టుతో పాటు కొంత మంది టెస్ట్ టీమ్కు ఎంపికైన ప్లేయర్లు ఇప్పటికే ఇంగ్లండ్లో ఆడుతున్నారు.
‘ఇండియా క్రికెట్ జట్టులో, ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్లో భాగం కావడం చాలా బాగుంది. యూకేకు స్వాగతం’ అని సాయి సుదర్శన్ బీసీసీఐ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో వ్యాఖ్యానించాడు. జూన్ 20 నుంచి లీడ్స్లో తొలి టెస్ట్, తర్వాతి మ్యాచ్లు బర్మింగ్హామ్ (జూలై 2–6), లార్డ్స్ (జూలై 10–14), మాంచెస్టర్ (జూలై 23–27), ఓవల్ (ఆగస్టు 4–8) లలో జరుగుతాయి.