
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలోని 16 రాష్ట్రాల్లొ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. మంగళవారం ఆయన అటానమస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతినిధులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలో కరోనా వైరస్ కేసులు రెట్టింపయ్యే సంఖ్య కూడ తగ్గిందన్నారు. ఏడు రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని … గత 14 రోజులుగా 47 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదన్నారు హర్షవర్ధన్.
అలాగే దేశవ్యాప్తంగా 300 జిల్లాలు హాట్ స్పాట్ నుండి విముక్తి పొందాయని చెప్పారు కేంద్రమంత్రి. ఈ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందన్న ఆయన.. కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మినహా మిగిలిన రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.
No fresh case reported in 80 districts since last 7 days. In 47 districts, no case has been reported in last 14 days, while 39 districts have not reported a case since last 21 days. 17 districts have not reported a case for last 28 days: Dr. Harsh Vardhan, Union Health Minister pic.twitter.com/iGL3m6lsNq
— ANI (@ANI) April 28, 2020