ఉద్యోగం రాక..యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాక..యువకుడి ఆత్మహత్య

డిగ్రీ, ఐటీఐ చదివినా ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో  కరీంనగర్ ​జిల్లా సిరిసేడుకు చెందిన మహమ్మద్ షబ్బీర్(26) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి వద్ద సూసైడ్ లెటర్ దొరికింది. 

జమ్మికుంట, వెలుగు: ఐటీఐ చేసిండు.. డిగ్రీ చదివిండు.. కానీ ఉద్యోగం రాలేదు. మనస్తాపానికి గురై ట్రైన్ కింద పడిండు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ దగ్గర్లో జరిగిందీ ఘటన. జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మొహమ్మద్ షబ్బీర్ (26).. ఆదివారం తెలంగాణ ఎక్స్‌‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగం వల్లే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌‌లో పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. తెలంగాణ వస్తే తమ బిడ్డకు ఉద్యోగం వచ్చి తమను పోషిస్తాడని అనుకున్నామని, చెట్టంత కొడుకు ఇలా ట్రైన్ కింద పడి చనిపోయాడని షబ్బీర్ తల్లిదండ్రులు అంకుష్ మియా, యాకోబి కన్నీరుమున్నీరయ్యారు. షబ్బీర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.