కాంగ్రెస్ లేకుండా  ప్రతిపక్ష ఫ్రంట్ ఊహించలేం

కాంగ్రెస్ లేకుండా  ప్రతిపక్ష ఫ్రంట్ ఊహించలేం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశంలో ప్రతిపక్ష ఫ్రంట్​ను ఊహించలేమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా రెండు మూడు ప్రతిపక్షాలుంటే ఏమీ సాధించలేవని కామెంట్ చేశారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. యూపీఏ ముగిసిన ముచ్చటేనని కామెంట్ చేసిన మమతా బెనర్జీకి ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్ లేకుండా అపొజిషన్ ఫ్రంట్ ఉండదు. నాయకత్వం వహించి, ఆ దిశగా పనిచేయాలని ఎంపీ రాహుల్​ గాంధీకి సూచించా. ఏ నాయకుడి గురించి నేను మాట్లాడట్లే. దేశం లో ఒక్క ప్రతిపక్షమే ఉండాలంటున్నా. ప్రతిపక్షాలు రెండు మూడుంటే బీజేపీని ఏం ఎదుర్కొంటాం?”అని సంజయ్ రౌత్ అన్నారు.