లింగమార్పిడి చేసుకునే వారికి ఉత్తర్ప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి గుడ్ న్యూస్ చెప్పింది. నోయిడా జిల్లా ఆసుపత్రిలో లింగమార్పిడి చేయించుకునే వ్యక్తుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్ని ప్రారంభించింది.
ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సదుపాయం దేశంలోనే ఫస్ట్ది అని వైద్యులు చెబుతున్నారు. ఈ కేంద్రాల్లో వారి డేటాను సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఉంటుందని వివరించారు.
ట్రాన్స్జెండర్లు ఓపీ నమోదు ప్రక్రియలో వివక్షను ఎదుర్కునేవారు. ట్రాన్స్జెండర్ సంఘం నుంచి వచ్చిన కంప్లెంట్స్ వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు.
ALSO READ :గడ్డి మందులు కూడా నకిలీవే..
ప్రిస్క్రిప్షన్ప్రకారమే మందులు వాడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్లు వెల్లడించారు. ఈ చర్యతో లింగమార్పిడి చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని డాక్టర్ అగర్వాల్ పేర్కొన్నారు.