ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు: మంత్రి హరీష్ రావు

ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు: మంత్రి హరీష్ రావు

ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తే సహకరిద్దామని ప్రజలకు పిలుపు నిచ్చారు. సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనాను అరికట్టవచ్చన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకూ ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలను కోరారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తోందన్నారు. అమెరికా, ఇటలీలో తలెత్తిన పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాల్సిందేనని…అది ఒక్కటే మన ముందున్న మార్గమన్నారు మంత్రి హరీష్.