
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లురవికి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గళం వెబ్ పేజ్లో అనుచిత పోస్టింగ్స్ చేశారంటూ మహేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గాంధీభవన్కు వెళ్లి సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందించారు. అంతకుముందు కూడా ఈ కేసుకు సంబంధించి మల్లురవికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు అందాయి. ఆ సమయంలో విచారణకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ వార్ రూంపై పోలీసులు దాడి చేసిన సమయంలో వార్ రూమ్కు తానే ఇన్ఛార్జినని తెలిపారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో కేవలం వ్యూహాలు మాత్రమే రూపొందించుకుంటామని ఆయన పోలీసులకు చెప్పారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడంపై మల్లు రవి ఇంకా స్పందించలేదు.