War Room Case : మల్లురవికి మరోసారి నోటీసులు

War Room Case : మల్లురవికి మరోసారి నోటీసులు

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లురవికి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గళం వెబ్ పేజ్‭లో అనుచిత పోస్టింగ్స్ చేశారంటూ మహేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గాంధీభవన్‭కు వెళ్లి సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందించారు. అంతకుముందు కూడా ఈ కేసుకు సంబంధించి మల్లురవికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు అందాయి. ఆ సమయంలో విచారణకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ వార్ రూంపై పోలీసులు దాడి చేసిన సమయంలో వార్ రూమ్‭కు తానే ఇన్‌ఛార్జినని తెలిపారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో కేవలం వ్యూహాలు మాత్రమే రూపొందించుకుంటామని ఆయన పోలీసులకు చెప్పారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడంపై మల్లు రవి ఇంకా స్పందించలేదు.