అగ్రికల్చర్​లో స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​ కోసం నోటిఫికేషన్

అగ్రికల్చర్​లో స్పెషలిస్ట్​ ఆఫీసర్స్​ కోసం నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో 195 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్‌‌‌‌టీవో) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్‌‌‌‌)-2023 నిర్వహణకు సంబంధించి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌‌‌‌ సైంటిస్ట్స్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు(ఏఎస్‌‌‌‌ఆర్‌‌‌‌బీ) ఉమ్మడి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.

అర్హత:

సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్‌‌‌‌కు21 ఏళ్ల నిండి ఉండాలి. నెట్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌, ఎస్‌‌‌‌టీవో-2023 ఉత్తీర్ణత మార్కులు: యూఆర్‌‌‌‌ అభ్యర్థులకు 75.0 (50%), ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌‌‌‌ 67.5 (45%), ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 60.0 (40%).

సెలెక్షన్​:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌, ఎస్‌‌‌‌టీవో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 22 నుంచి ఏప్రిల్​ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు ఏప్రిల్​ 26 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.asrb.org.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.