పెద్దమ్మతల్లికి పంచలోహ కిరీటం

పెద్దమ్మతల్లికి పంచలోహ కిరీటం

మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మహబూబాబాద్​లోని గోపాలపురం పెద్దమ్మ తల్లి విగ్రహానికి పంచలోహ కిరీటాన్ని ఎన్ఆర్ఐ స్టూడెంట్ గుండెల వినయ్​బాబు బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, సలహాదారుడు సింగని అశోక్​మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్​ గుండెల రాజు, రేణుక దంపతుల పెద్ద కుమారుడు వినయ్​బాబు రూ.26వేల విలువైన పంచలోహ కిరీటాన్ని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి అమర్చినట్లు తెలిపారు.

అనంతరం వినయ్​బాబును టెంపుల్ ట్రస్ట్, నడిగడ్డ, హన్మంతుని గడ్డ ముదిరాజు పెద్దలు అభినందించి, సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గుండెల రాజు, ఉపాధ్యక్షుడు కొండ సారయ్య, కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, కోశాధికారి భూముల వెంకన్న,  సలహాదారులు సింగని అశోక్​, అల్వాల వెంకన్న

హన్మంతునిగడ్డ, నడిగడ్డ ముదిరాజు సంఘం అధ్యక్షులు భూం నాగరాజు, కొప్పు ఉప్పలయ్య, కార్యదర్శులు పుచ్చ బాలకృష్ణ, వెములకొండ మల్లేశ్, కోశాధికారులు తోట శ్రీనివాస్, భూం నర్సయ్య, పుచ్చ వెంకటయ్య, ట్రస్ట్ డైరెక్టర్లు, సంఘ సభ్యులు తదితరులున్నారు.