రూ. 18వేల కోట్లను సేకరించనున్న ఎన్టీపీసీ

రూ. 18వేల కోట్లను సేకరించనున్న ఎన్టీపీసీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీ ఎన్టీపీసీ బోర్డు ఎన్​సీడీలు లేదా ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్​ బాండ్లను జారీ ద్వారా రూ. 18వేల కోట్ల వరకు సేకరించే ప్రతిపాదనను ఆమోదించింది.  కంపెనీ డైరెక్టర్ల బోర్డు శనివారం జరిగిన సమావేశంలో ఈ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్​సీడీలు) జారీ చేయడానికి వాటాదారుల ఆమోదం కోరింది. 

పోస్టల్ బ్యాలెట్ ముసాయిదా నోటీసును కూడా పరిశీలించి ఆమోదించింది.   ప్రత్యేక తీర్మానం ఆమోదించిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయ్యే వరకు దేశీయ మార్కెట్లో ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్ ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిరీస్‌‌‌‌లలో రూ. 18వేల కోట్ల వరకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీని బోర్డు ఆమోదించింది.