ఇవాళ ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ

ఇవాళ ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ

న్యూఢిల్లీ, వెలుగు :  ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, సినీ నటుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన స్మారక నాణేన్ని విడుదల చేయనుంది. సోమవారం(ఆగస్టు 28) రాష్ట్రపతి భవన్‌‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఆవిష్కరించను న్నారు. 

ఈ వేడుకలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ చీఫ్ పురందేశ్వరి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తదితరులు హాజరుకాను న్నారు. ఈ ప్రొగ్రాంకు తనకు కూడా ఆహ్వానం అందించాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సైతం ఇప్పటికే ప్రెసిడెంట్‌‌కు లేఖ రాశారు. కాగా, ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలకు గుర్తుగా ఆర్బీఐ ఈ రూ.100 నాణేన్ని తయారు చేసింది.