నర్సు నిర్లక్ష్యం.. తెగిపడిన పసికందు చేతి వేలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరీ ఇంత నిర్లక్ష్యమా..?

నర్సు నిర్లక్ష్యం.. తెగిపడిన పసికందు చేతి వేలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరీ ఇంత నిర్లక్ష్యమా..?

వెల్లూరు: నర్సు నిర్లక్ష్యం వల్ల పసికందు చేతి వేలు తెగిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్లో జరిగింది. శస్త్ర చికిత్స నిమిత్తం ఆ పసికందును చెన్నై హాస్పిటల్కు తరలించారు. సదరు నర్స్ విధుల్లో ఉన్న సీనియర్ నర్స్ కావడం గమనార్హం. మే 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ముళ్లిపాళ్యం ప్రాంతానికి చెందిన విమల్ రాజ్ (30), అతని భార్య నివేద(24)కు బాబు పుట్టాడు. వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నివేద పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే.. ఆ మగబిడ్డకు ఆరోగ్యం బాలేక పోవడంతో సెలైన్ పెట్టారు. గ్లూకోజ్ సూదిని మార్చేందుకు ఆ బిడ్డ చేతికి ఉన్న టేప్ను తీసేందుకు ఒక సీనియర్ నర్స్ ప్రయత్నించింది.

ALSO READ : కరోనాపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు... 6 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కేంద్రానికి ఆదేశాలు..

ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న కత్తెర పొరపాటున బిడ్డ చేతి వేలిని కట్ చేసింది. ఈ సమయంలో ఆమె ఫోన్ వాడుతుందని బాధిత కుటుంబం చెప్పింది. ఆమె నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చేతి వేలు తెగిపోయిందని ఆ పసికందు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెల్లూరు జిల్లా కలెక్టర్ సుబ్బు లక్ష్మి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబం చెబుతున్నట్లు.. ఆ పసికందుకు వైద్యం చేస్తున్న సమయంలో సదరు నర్సు ఫోన్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చెన్నై స్టాన్లీ హాస్పిటల్లో బాధిత పసికందుకు వైద్యం అందిస్తున్నారు.