కరోనాపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు... 6 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కేంద్రానికి ఆదేశాలు..

కరోనాపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు... 6 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కేంద్రానికి ఆదేశాలు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 3 వేల 961 యాక్టివ్ కేసులు ఉండగా.. 28 మరణాలు నమోదైనట్లు సమాచారం. ఢిల్లీలో 294 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా ఇంకా ముగియలేదని... 6 వారాల్లోగా కరోనా శాంపిల్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, పరీక్ష విధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. మహమ్మారి ఇంకా ముగియలేదని పేర్కొంది కోర్టు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల విజృంభిస్తున్న నేపథ్యంలో కోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మే 30, 2023న జరిగిన కీలక సమావేశం ఫలితాలకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ అందలేదని గుర్తించిన కోర్టు మే 28న ఈ  మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆ సమావేశంలో, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నుండి పాథాలజీ, బయోకెమిస్ట్రీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ నిపుణులతో కూడిన నాలుగు నిపుణుల ఉపకమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. శాంపిల్ సేకరణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను నిర్వచించడానికి, సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, కోవిడ్-19 శాంపిల్స్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ కోసం ఒక విధానాన్ని రూపొందించడం ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. 

ALSO READ : డాక్టర్లకంటే AI చాట్‌బాట్‌లు తెలివైనవా?..ఆరోగ్య సంరక్షణలో AI వెనుక అసలు నిజం ఏంటీ?

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయని.. ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఢిల్లీ కోర్టు. సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వు గురించి తెలియజేయాలని మరియు ఆరు వారాల్లోగా వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ (CGSC) మోనికా అరోరాను కోర్టు ఆదేశించింది. జూలై 18, 2025న ఈ  అంశంపై తదుపరి విచారణ జరగనుంది.