భారత్ జోడో యాత్ర: ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఎవరికో తెలుసా..

భారత్ జోడో యాత్ర: ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఎవరికో తెలుసా..

భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం (జవవరి 21)  అసోంలో కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బస్సులో వెళ్తుండగా సోనిత్ పూర్ వద్ద కొందరు మోదీ అభిమానులు అడ్డుకున్నారు. జై శ్రీరామ్, మోదీ-మోదీ అంటూ పెద్ద ఎత్తన నినాదాలు చేశారు. దీంతో రాహుల్ బస్సులో కూర్చొని ప్రజలతో పాటు మోదీ ఫ్యాన్స్ కు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు. 

మా మొహబ్బత కి దుకాణ్( ప్రేమ దుకాణం) అందరి కోసం తెరిచి ఉంది. జోడేగా భారత్, జీతేగా హిందుస్థాన్  అంటూ సంఘటన సంబంధించిన వీడియోను X పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, అసోం సీఎం హిమంత బిస్వా శర్మకు భయపడదని అన్నారు. మణిపూర్, మహారాష్ట్ర న్యాయ్ యాత్ర అసోం లెగ్ లో గాంధీ, జైరాం రమేష్ సహా తమ నాయకులను బీజేపీ మద్దతుదారులు టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.