ఒడిశా రైలు ప్రమాదం.. రక్తం ఇవ్వడానికి ఆస్పత్రికి భారీగా చేరిన జనం

ఒడిశా రైలు ప్రమాదం.. రక్తం ఇవ్వడానికి ఆస్పత్రికి భారీగా చేరిన జనం

ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య  238కు చేరింది. 900 పైగా మందికి గాయాలయ్యాయి.  ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా మృతదేహాలు  కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఎంతో మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నా బోగీల కింద చిక్కుకున్న చాలా మంది బాధితులు సాయం కోసం ఆర్జిస్తున్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఓడీఆర్ఎఫ్, 24 ఫైర్ సర్వీస్ యూనిట్స్ ,లోకల్ పోలీసులు,వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరందరికీ   రక్తం అవసరం ఉందని తెలిసి  చాలా మంది రక్తదానం  చేసేందుకు భద్రక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కట్టారు. క్యూలో నిలబడి రక్తం దానం చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.