
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ చిత్రంలో నటిస్తారు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. గురువారం ఈ కొత్త ప్రాజెక్ట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సూర్య హీరోగా ‘జై భీమ్’ చిత్రం తీసి మెప్పించిన టి.జె.జ్ఞానవేల్.. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. వరుస భారీ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. నిర్మాత సుభాస్కరన్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం దీన్ని ప్రకటించారు.
రజినీకాంత్తో ఈ సంస్థ నిర్మిస్తున్న మూడో చిత్రమిది. గతంలో తలైవా హీరోగా ఇదే సంస్థలో 2.0, దర్భార్ చిత్రాలు వచ్చాయి. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. రజినీకాంత్ కెరీర్లో ఇది 170వ చిత్రం. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేస్తామని కూడా చెప్పారు. ‘జైభీమ్’ తరహాలోనే మరో సామాజిక సమస్య నేపథ్యంలో జ్ఞానవేల్ ఈ సినిమాని తీయబోతున్నట్టు తెలుస్తోంది.