భద్రాద్రికొత్తగూడెం/ మహబూబాబాద్/ టేకులపల్లి/ జనగామ అర్బన్/ గూడూరు, వెలుగు : రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సూచించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం అరైవ్ అలైవ్ప్రోగ్రామ్ ను నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ బి.రోహిత్రాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసి, అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.
మహబూబాబాద్ పట్టణంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, కలెక్టర్ స్నేహశబరీశ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన వాల్పోస్టర్ను రిలీజ్ చేశారు. టేకులపల్లిలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనగామ పట్టణంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్రనాయక్, డీటీవో శ్రీనివాస్వాహనదారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గూడూరులో మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్వాహనదారులకు అవగాహన కల్పించారు.

