- కామారెడ్డి కలెక్టరేట్లో ఓ తల్లి ఫిర్యాదు
కామారెడ్డి, వెలుగు: కొడుకు తనకు తెలియకుండా భూమిని పట్టా చేయించుకుని, తనను పట్టించుకోవడం లేదంటూ నడ వలేని స్థితిలో ఉన్న ఓ తల్లి అంబులెన్స్లో ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్పేట్కు చెందిన వీరభద్రప్ప, రత్నమ్మకు కొడుకు శంకర్, ఇద్దరు కూతుళ్లున్నారు.
శంకర్ 20 ఏళ్ల కింద పేరెంట్స్ను ఇంట్లో నుంచి పంపేయడంతో కూతుళ్ల వద్ద ఉంటున్నారు. 2017లో వీరభద్రప్ప చనిపోయాక అతడి పేరిట ఉన్న 13.29 ఎకరాల భూమిని తల్లికి తెలియకుండా శంకర్ తన పేరిట మార్చుకున్నాడు. చిన్న కూతురు కమలాబాయితో కలిసి కలెక్టరేట్ సూపరింటెండెంట్ సాయి భుజంగరావుకు ఆమె ఫిర్యాదు చేసింది.