వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ

వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ

వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి ఆమె బంగారు ఆభరణాలను దొంగ దోచుకెళ్లాడు. ఈ సంఘటన  సిద్దిపేట త్రీ టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో గురువారం జరిగింది. ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ప్రతాప్, ఝాన్సీ ప్రగతి నగర్ లోని ఆత్మీయ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నారు. రోజులాగే డ్యూటీ కి వెళ్లగా, ఇంట్లో ఝాన్సీ తల్లి నాగలక్ష్మి పిల్లలతో కలిసి ఉంటున్నది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి గడియపెట్టి నాగలక్ష్మిని తుపాకీతో బెదిరించాడు. 

ఆమె పుస్తెలతాడు, బంగారు చైను, బంగారు గాజులు లాక్కొని ఆమెను బాత్రూంలో బంధించి పారిపోయాడు. అనంతరం నాగలక్ష్మి అరుపులు విన్న అపార్ట్ మెంట్  వాసులు వచ్చి ఆమెను బయటకు తీశారు. ఆమె తన కూతురు ఝాన్సీకి దోపిడీ విషయం తెలపడంలో.. ఝాన్సీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.