ఇలా చేస్తే ఇక గ్యాస్ తో పని ఉండదేమో.. ఎండ వేడిమితో ఆమ్లెటా..?

ఇలా చేస్తే ఇక గ్యాస్ తో పని ఉండదేమో.. ఎండ వేడిమితో ఆమ్లెటా..?

ఈ సారి ఎండలు సుర్రుమంటున్నాయి. ఏప్రిల్ నెలలోనే విపరీతమైన వేడి ఉంటోంది. ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వేడిగాలులతో సతమవుతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి యూపీ, బీహార్ వరకు ఈ తీవ్రత మరింత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఈ వేసవిలో పరిస్థితిని ఎలా ఉందో చెప్పడానికి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎండ వేడిమితో టెర్రస్‌పై గుడ్డు వేయించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం వాతావరణం చాలా వేడిగా ఉంది. దీనికి రుజువు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోనే. వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇటీవలే @puchabuchandrani అనే ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ అయింది.  ఈ వీడియోలో  ఒక వ్యక్తి తన ఇంటి పైకప్పుపై ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను ఆమ్లెట్ చేయడానికి ఎలాంటి గ్యాస్-స్టవ్ నూ ఉపయోగించలేదు.

ఎండలో ఆమ్లెట్..

నిప్పు లేకుండా గుడ్డు ఎలా ఉడుకుతుంది అని అనుకోవచ్చు. కానీ ట్రోల్ అవుతున్న ఈ వీడియోలో దాన్ని చూడవచ్చు. ఓ వ్యక్తి వాతావరణం ఎంత వేడిగా ఉందో చెప్పే ప్రయత్నంగా ఓ వీడియో షేర్ చేశారు. అతను టెర్రస్ మీద ఎండలో వేయించడానికి పాన్ పెట్టి ఆపై దానిపై గుడ్డు పగలగొట్టాడు. కొద్దిసేపటికే సూర్యరశ్మి కారణంగా గుడ్డు ఆమ్లెట్ గా తయారైంది. వేయించడానికి పాన్ కూడా నల్లగా ఉండడంతో ఇది మరింత సులభమైంది. అయితే ఈ సమయంలో పాన్ కింద మంట లేదా గ్యాస్ స్టవ్ లాంటివి ఏం లేకుండా గుడ్డును ఉడికేలా చేశారులే. అంతే కాదు వీడియో చివర్లో, అతను గుడ్లు తినడం కూడా చూడవచ్చు.

వీడియో వైరల్...

ఈ వీడియోకు ఇప్పటివరకు17 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాదు ఎంతో మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇంత వేడిలో బయట నిల్చున్నాడని, తల వేడెక్కిపోయిందని ఒకరు కామెంట్ చేయగా.. ఆ వీడియో ఫేక్ అని, దాన్ని కట్ చేసి వీడియో తీశారని మరికొందరు వాదిస్తు్న్నారు. గుడ్డు ఉడకాలంటే మంట తప్పనిసరి అని ఇంకొకరు రాసుకొచ్చారు. తర్వాతి వీడియోలో చికెన్ కర్రీ చేయి అని ఒకరు చెప్పడం మరింత ఫన్నీగా అనిపిస్తోంది.

https://www.facebook.com/watch/?ref=external&v=250951167375020