దీదీ ఒత్తిడిలో ఉన్నారు.. ఆమె పని ఫినిష్

దీదీ ఒత్తిడిలో ఉన్నారు.. ఆమె పని ఫినిష్

కోల్‌‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో త‌ృణమూల్ కాంగ్రెస్‌‌కు ఓటమి తప్పదని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. తృణమూల్ ఓడిపోబోతోందనే విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసన్నారు. ‘టీఎంసీ ఓడిపోతోందనే విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. దీదీతోపాటు ఆ పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అందుకే రిగ్గింగ్ చేస్తున్నారంటూ అనవసర, అర్థం పర్థం లేని ఆరోపణలకు ఆ పార్టీ నాయకులు దిగుతున్నారు. ఈ విషయం మీద ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లొచ్చు’ అని ఘోష్ పేర్కొన్నారు.