ఆర్టీసీ కార్మికులకు 4 శాతం డీఏ

ఆర్టీసీ కార్మికులకు 4 శాతం డీఏ

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు 4 శాతం డీఏ శాంక్షన్ చేస్తూ మేనేజ్​మెంట్ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల జీతంతో ఈ డీఏ యాడ్ అవుతుందని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సులు సులువుగా వెళ్లేందుకు టోల్ గేట్ల దగ్గర ప్రత్యేక లైన్ కేటాయించాలని నేషనల్ హైవే, ఆర్ ఆండ్ బీ అధికారులను ఎండీ సజ్జనార్ కోరారు.

ఇందుకు అంగీకారం తెలుపుతూ ఆర్టీసీకి ఆ శాఖల అధికారులు రిప్లై ఇచ్చినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. కాగా, “టీఎస్ ఆర్టీసీ జీవా” పేరుతో ఆర్టీసీ వాటర్ బాటిల్స్​ను ఈ నెల 9న లాంచ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.