కలర్ టీవీకి 40 ఏళ్లు

కలర్ టీవీకి 40 ఏళ్లు

న్యూఢిల్లీ: ఇప్పుడంటే పలుచటి స్మార్ట్​టీవీలు, ట్యాబ్​లు వచ్చేశాయ్​. కానీ 1980లలో టీవీ అంటే లగ్జరీ! అప్పుడు బ్లాక్ అండ్​ వైట్​ టీవీలే దిక్కు. నో కలర్​ టీవీ! సరిగ్గా 40 ఏళ్ల క్రితం..అంటే 1982 ఏప్రిల్​ 25న రంగుల టీవీ ఇండియాకు వచ్చేసింది. ఇందుకోసం పెద్ద తతంగమే నడిచింది. ఫారిన్​ నుంచి కలర్​ టీవీల దిగుమతులకు ఒప్పుకోవాలా.. వద్దా ? అనే విషయమై పార్లమెంటులో, ప్రభుత్వంలో గంటల కొద్దీ చర్చలు నడిచాయి. అయితే అదే ఏడాది అక్టోబరులో ఏషియన్​ గేమ్స్​ ఉండటంతో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాత్రికి రాత్రే పర్మిషన్లు ఇచ్చింది. కేవలం మూడే కంపెనీల నుంచి దిగుమతి చేసుకోవాలని షరతు పెట్టింది. కలర్​ టీవీలు వద్దంటూ పార్లమెంటులో అపోజిషన్​ పార్టీలు నిరసన తెలిపాయి.