ఎమ్మెల్యే బిగాల మాటలకే పరిమితం : ధన్​పాల్​ సూర్యనారాయణ

ఎమ్మెల్యే బిగాల మాటలకే పరిమితం : ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్​అర్బన్, వెలుగు:  ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా కేవలం మటలకే పరిమితమయ్యాడు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​ సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం నగరంలోని 36వ డివిజన్​లో గడపగడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా ధన్​పాల్​ మాట్లాడుతూ నగర సుందీరకరణ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్న దుర్వినియోగం చేశారని ఆరోపించారు.  నగరంలో కాలనీలన్నీ కంపుకొడుతున్నాయన్నారు. 

ఒక్కో  డివిజన్​కు రూ.కోటి కేటాయిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాటలు నీటిమూటలుగా మారాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం ఖాయమన్నారు. ఈ నిజాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్​ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టెంట్​శ్రీనివాస్​, జ్యోతి, రాకేశ్, లక్ష్మీనారాయణ, రాజు, వినోద్​రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.