ఒక్కరోజు అన్నప్రసాదం : వెంకన్నకు రూ. కోటి విరాళం

ఒక్కరోజు అన్నప్రసాదం : వెంకన్నకు రూ. కోటి విరాళం

తిరుమల:ఒక్క రోజు అన్న‌ప్ర‌సాద పథకానికి ఓ భక్తుడు రూ.కోటి విరాళం ఇచ్చాడు. ఢిల్లీకి చెందిన శ్రీనివాస కృష్ణ అనే భక్తుడు గురువారం ఒక్క రోజు అన్నప్రసాద పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ అధికారులకు అందజేసిన దాత.. తన కుటుంబ సభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అన్నప్రసాదం ట్రస్ట్ ప్రత్యేక అధికారి శ్రీ వేణుగోపాల్ తో కలిసి ఉదయం అల్పాహారం స్వీకరించారు.