హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు

హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు

హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం పలువురు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ స్థానానికి ఆరుగురి నుంచి 8 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ షా ముజాహిద్ హుసైనీ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 13 మంది నుంచి నామినేషన్లు అందాయి. 

అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం 9 మంది నుంచి 11 సెట్ల నామినేషన్లు వచ్చాయి. వీరిలో 7 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 మంది నామినేషన్లు వేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సోమవారం 9 మంది నుంచి 11 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీగణేష్​ నారాయణ్, బీజేపీ నుంచి ఎం.ఎ.శ్రీనివాసులు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది నామినేషన్లు వేశారు.