న్యూఢిల్లీ: తాజా పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ రూ. 40 వేల కోట్లను దాటిందని అంచనా. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సేల్స్ 27 శాతం పెరిగినట్లు రెడ్సీర్స్ స్ట్రాటజీ కన్సల్టింగ్ వెల్లడించింది. అమ్మకాలలో ఫ్లిప్కార్ట్ గ్రూప్ (మింత్రా, షాప్సి) తన లీడర్షిప్ను కొనసాగించినట్లు పేర్కొంది. ఇక ఆర్డర్ వాల్యూమ్స్లో మీషో రెండో ప్లేస్లో నిలిచినట్లు తెలిపింది.
ఫెస్టివ్ సేల్ మొదటి వారం ఎనాలిసిస్ను రెడ్ సీర్స్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు సెప్టెంబర్22 – 30 మధ్య భారీ ఆఫర్స్తో సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ షాపింగ్ లిస్టులో మొబైల్ ఫోన్స్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నట్లు రెడ్సీర్స్ వెల్లడించింది. గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ)లో 41 శాతం వాటాతో మొబైల్స్ కేటగిరీ టాప్లో ఉన్నట్లు తెలిపింది.
ప్రతీ గంటకు 56 వేల మొబైల్ ఫోన్ల అమ్మకాలు జరిగాయని పేర్కొంది. జీఎంవీలో 20 శాతం వాటాతో ఫ్యాషన్ రెండో ప్లేస్లో నిలిచినట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఫ్యాషన్ కేటగిరీ 48 శాతం గ్రోత్ సాధించింది. మొబైల్ ఫోన్ల అమ్మకాలు ఏడు రెట్లు, ఎలక్ట్రానిక్స్అండ్ అప్లయెన్సెస్ సేల్స్ 5 రెట్లు పెరిగినట్లు రెడ్సీర్స్రిపోర్టు వివరించింది.