సీఎం సభలో దళితబంధు 15 మందికే..

సీఎం సభలో దళితబంధు 15 మందికే..

హుజురాబాద్: దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం ఆగష్టు 16న హుజురాబాద్ లో ప్రారంభంకానుంది. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు హహుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో జరిగే బహిరంగ సభలో 15 మంది దళితులకు ఈ పథకం కింద చెక్కులు అందజేయనున్నారు. అయితే ఎన్నో గొప్పలు చెప్పుకొని.. ఏకంగా సీఎం ప్రారంభిస్తూ.. ఆయన చేతుల మీదుగా అందించే చెక్కులు కేవలం 15 మందికే కావడంతో.. అంతటా చర్చనీయాంశంగా మారింది.