పోలింగ్ నేపథ్యంలో రెండు రోజులుగా మూతబడ్డ గురువారం సాయంత్రం తెరుచుకున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు వైన్స్, బార్లను ఎక్సైజ్ అధికారులు సీల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం అమ్మకాలు జరగలేదు. అయితే గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే వైన్స్ ఓపెన్ చేస్తారని తెలుసుకున్న మద్యం ప్రియులు గంట ముందు నుంచే షాపుల వద్ద క్యూ కట్టారు. లిక్కర్ షాపుల నిర్వాహకులకు ఫోన్లు చేసి మరీ త్వరగా ఓపెన్ చేయాలని కోరారు. వైన్స్ ఓపెన్ చేసిన వెంటనే తమకు కావల్సిన బ్రాండ్స్ తీసుకుని అక్కడే సిట్టింగ్ వేశారు. గురువారంతో వైన్స్ లైసెన్స్ల గడువు ముగియడంతో శుక్రవారం నుంచి కొత్త లైసెన్స్ హోల్డర్స్ షాపులను నిర్వహించనున్నారు.
- హైదరాబాద్,వెలుగు