- చిన జీయర్ స్వామి
- మేడిపల్లిలో తిరుమల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండో బ్రాంచ్ ప్రారంభం
మేడిపల్లి, వెలుగు : మంచి ఆశయం, మంచి మనసుతో చేసే ప్రతి లక్ష్యం నెరవేరుతుందని త్రిదండి చిన జీయర్ స్వామి తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తిరుమల కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండో బ్రాంచ్ను సోమవారం ఆయన ప్రారంభించారు. చిన జీయర్తో పాటు అయోధ్య, కేదార్నాథ్ నుంచి వివిధ పీఠాల అధిపతులు, సినీ నటుడు సుమన్ హాజరై తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ను అభినందించారు. 25 ఏండ్లుగా బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తున్న తిరుమల కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ను ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి అభినందించారు.
మంచి లక్ష్యంతో బ్రాంచ్ ను ప్రారంభించిన చైర్మన్ చంద్రశేఖర్కు మంగళ శాసనాలు కలగాలన్నారు. బ్యాంక్ టీమ్ సైతం మంచి స్పిరిట్తో ఉన్నారని.. కస్టమర్లతో ఈ బ్రాంచ్ అభివృద్ది చెందాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు యుగంధర్ రెడ్డి, కావిడే పోచయ్య, తూంకుంట ప్రసన్న లక్ష్మి, బ్యాంక్ కస్టమర్లు, సిబ్బంది పాల్గొన్నారు.