
పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటించిన మరో మూవీ ‘ఆపరేషన్ రావణ్’. ఆయన తండ్రి వెంకట సత్య దర్శక నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రం జులై 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ ‘ఇదొక సైకో థ్రిల్లర్. చాలా కొత్తగా ఉంటుంది. మనలోని ఆలోచనల అంతర్యుద్ధాన్ని స్క్రీన్పై చూపించే ప్రయత్నం చేశాం. సైకో ఆలోచనలను విజువలైజ్ చేసే సీన్ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. నేను ఆనంద్ శ్రీరామ్ అనే టీవీ రిపోర్టర్గా కనిపిస్తా.
యాక్షన్ సీన్స్ కూడా చేశా. బైక్ సీక్వెన్స్ చేసేటప్పుడు గాయాలు అయ్యాయి. ఇందులో సైకోకు ఒక మాస్క్ పెట్టాం. చాలా మాస్కులు రిఫరెన్సులు తీసుకుని ది బెస్ట్ సెలెక్ట్ చేశాం. మాస్క్లో పులి, సింహం లాంటి క్రూర జంతువులను పోలినట్లు పెయింటింగ్ వేయించాం. సైకో క్యారెక్టర్కు ఈ మాస్క్ యూనిక్ అప్పియరెన్స్ ఇస్తుంది. సినిమా చూసి ఫస్టాఫ్లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం.
షూటింగ్ టైమ్లో నాన్నగారి డైరెక్షన్ పట్ల నాతో పాటు రాధిక శరత్కుమార్, చరణ్ రాజ్ లాంటి వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు. రాధిక గారితో నటించడం మర్చిపోలేని ఎక్స్పీరియెన్స్. ఆమె సింగిల్ షాట్లో ఏ సీనైనా చేసేవారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా సినిమా ఉంటుంది. ఇక నెక్స్ట్ ‘శశివదనే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తా. అలాగే ‘పలాస2’ స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది’ అని చెప్పాడు.