జీవోలన్నీ 24 గంటల్లో వెబ్‌సైట్ లో పెట్టాలి

జీవోలన్నీ  24 గంటల్లో వెబ్‌సైట్ లో పెట్టాలి

ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది హైకోర్టు. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ పిల్ పై సీజే హిమాకోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందన్నారు అడ్వకేట్ జనరల్ BS ప్రసాద్. నిబంధనలు ఖరారు చేసినట్లు వివరించారు. అయితే నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్ లో లేదన్నారు న్యాయవాది శశికిరణ్. జీఓలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటని సర్కారును ప్రశ్నించింది హైకోర్టు. ఏజీ వివరణ నమోదు చేసి.. వాసాలమర్రిలో దళితబంధుపై విచారణ ముగించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించింది.