కరోనా తీవ్రతను బాడీలో పెంచుతోంది మన బ్యాక్టీరియానే
అమెరికా సైంటిస్టుల స్టడీ
హ్యూస్టన్/న్యూఢిల్లీ: మామూలుగా మన ఒంట్లో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. అందులో మంచి చేసేవి ఉన్నాయి.. ముప్పు తెచ్చేవీ ఉంటాయి. ఇప్పుడు మన ఒంట్లోని ఆ బ్యాక్టీరియానే కరోనాకు హెల్ప్ చేస్తోందట. మహమ్మారి ముప్పును, తీవ్రతను పెంచేసి ప్రాణాల మీదకు తెస్తోందట. అమెరికాలోని యూనివర్సిటీ ఆప్ టెక్సస్ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ సైంటిస్టుల స్టడీలో ఈ విషయం తేలింది. అయితే, ఆ ముప్పు ఎక్కువగా లావుగా ఉన్నవాళ్లు, షుగర్తో బాధపడుతున్నోళ్లలోనే ఉందంటున్నారు వర్సిటీ సైంటిస్టులు. నిజానికి లావుగా ఉన్నవాళ్లు, షుగర్తో బాధపడేవాళ్లలో లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి తొందరగా బయటపడతారన్న వాదనలున్నాయని, మరి కరోనా విషయంలో అది ఎందుకు జరగట్లేదని ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం, వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక లంగ్స్లోకి వెళ్లేందుకు మనలో ఉండే ఏసీఈ2 రిసెప్టర్లు సహకరిస్తున్నాయని, అక్కడ మన ఒంట్లో ఉండే
బ్యాక్టీరియా (మైక్రోబయాటా) కరోనాతో జతకట్టి వైరస్ ముప్పును పెంచుతోందని తేల్చారు. డయాబెటిక్ పేషెంట్లు, లావుగా ఉన్నోళ్లలో ఆ ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించారు. బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే లైపోపాలీసాకరైడ్(ఎల్పీఎస్ ) అనే మాలిక్యూల్స్ కరోనా వైరస్తో కలిసి మంచిగున్న కణాలను పాడు చేస్తున్నాయని గుర్తించారు. దాంతో సైటోకైన్ స్టార్మ్ ఎక్కువవుతోందని సైంటిస్టులు తేల్చారు.
యాంటీవైరల్ మందులకు కేంద్రం అనుమతి: సుప్రీం
కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్కు రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ వంటి యాంటీ వైరల్ మందులకు కేంద్రం అనుమతిచ్చిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఏ లైసెన్సూ లేకుండా ఆ మందులు తయారుచేస్తూ అమ్ముతున్న 10 ఫార్మా కంపెనీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సీజేఐ ఎస్ ఏ బోబ్డె, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన
బెంచ్ బుధవారం విచారించింది. న్యూడ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2018ని గుర్తుచేసిన బెంచ్ .. ఆ మందుల వాడకానికి కేంద్రం అనుమతిచ్చిందని పేర్కొంది. ఆ రూల్ చూడకుండానే పిటిషన్ వేశారంటూ పిటిషనర్కు చురకలంటించింది.
For More News..
