కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మాండ్య జిల్లాలోని PESఇంజినీరింగ్ కాలేజీలో కొవిడ్ కలకలం రేపింది. మొత్తం 125మందికి ఈ వైరస్ సోకగా.. వీరిలో 107 మంది విద్యార్థులు ఉన్నారు. 18 మంది హాస్టల్ సిబ్బంది ఉన్నట్టు అధికారులు చెప్పారు. మూడు హాస్టల్ భవనాల్లో మొత్తం 600 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీంతో స్థానిక అధికారులు క్యాంపస్కి వెళ్లి పరిశీలించారు. అధిక శాతం మందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపారు. అందరూ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు అధికారులు.
మరిన్ని వార్తల కోసం..