అన్నదమ్ముల మధ్య 4 అంగుళాల స్థలం గొడవ.. ఒకరి మృతి

అన్నదమ్ముల మధ్య  4 అంగుళాల స్థలం గొడవ.. ఒకరి మృతి

పెనుబల్లి, వెలుగు: స్థల వివాదంలో తమ్ముడు తిట్టాడని అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రానికి చెందిన బొర్రా నాగేశ్వరరావు(55), వెంకటేశ్వరరావు అన్నదమ్ములు. కొంత కాలంగా ఇద్దరూ 4 అంగుళాల ఇంటి స్థలం విషయంలో గొడవ పడుతున్నారు. శనివారం పంచాయితీ పెట్టగా.. చెరో 2 అంగుళాల స్థలం విడిచిపెట్టి వాడుకోవాలని పెద్ద మనుషులు సూచించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తనను తిట్టాడని నాగేశ్వరరావు పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు పెనుబల్లి ఏరియా హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వియం బంజర్ పోలీసులు కేసు ఫైల్ ​చేశారు.