
కరోనా ప్రభావం వలన ఉద్యోగుల జీతాలను 25శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది ఓయో హోటల్స్. ఏప్రిల్ నుంచి నాలుగు నెలలవరకు 25శాతం కోత విధిస్తున్నట్లు చెప్పింది. మరి కొందరిని సెలవులపై ఇంటికి పరిమితం చేసింది. తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోహిత్ కపూర్ తెలిపారు. ఇందుకు గాను ఆయన బుధవారం నోట్ ను విడుదల చేశారు.
కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించడంతో హోటల్స్ బిజినెస్లు కుంటుపడ్డాయని రోహిత్ తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోవడం దేశీయంగా.. వ్యాపారాలు స్తంభించడంతో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.